టాలీవుడ్ అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ రాజమౌళి తీస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమా. బాహుబలి వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాపై దేశంలో చాలా ఇండస్ట్రీల కన్ను ఉంది. అంతేకాకుండా ఈ సినిమా గురించి ఇటీవల రాంచరణ్ ఎన్టీఆర్ లు అమెరికాలో ఫోటో షూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు .. ఈ రోజు ఐపీఎల్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. రాజమౌళి ఇంకా ఈ సినిమా కథను తనకు పూర్తిగా చెప్పలేదని, సినిమాకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించాడు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. క్రికెటర్స్ జీవిత కథలతో సినిమాలు రావడం మంచిదే అని .. కానీ తాను మాత్రం అలాంటి బయోపిక్ లో నటించనని చెప్పేసాడు. మొత్తానికి రాజమౌళి తమతో చేస్తున్న సినిమా స్టోరీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు మాత్రం ఇంకా తెలియదు అని తెలుస్తోంది.