వేసవి కానుకగా విడుదలైన రంగస్థలం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ క్రమంలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా యూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడు గా అద్భుతంగా నటించాడు. చిట్టిబాబు పాత్రకి తగిన న్యాయం చేశాడు చరణ్. ప్రస్తుతం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్ సీస్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమా చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ చిత్రం మంచి విజయం అందుకుందని, రామ్చరణ్ మైండ్ బ్లోయింగ్, అద్భుతమని ట్వీట్ చేశారు. ‘హే సుకుమార్, ఇదిగో నీకు నా మూడు నమస్కారాలు.. మూడు ముద్దులు’ అని వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. రంగస్థలం విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్లతో ముందుకు సాగుతుంది.