ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసుల పేరిట కూడా ఫీజులు వసూలు చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నటుడు శివ బాలాజీ తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సి) ఛైర్మన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూల్ యాజమాన్యం ఫీజు కోసం వేధిస్తుందని ఆరోపించారు. ఫీజులు తగ్గించుకోమని అడిగితే తన కుమారుడిని ఆన్ లైన్ క్లాసుల నుంచి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేశారని తెలిపాడు. అయితే శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సి స్పందించింది. మౌంట్ లిటేరాజీ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సి ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు పంపింది. అయితే చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన ఆయన వారంత బయటికి చెప్పడానికి భయపడుతున్నారని తెలిపారు. మరి సెలెబ్రిటీల ఫిర్యాదుతోనైనా ప్రైవేట్ విద్యా సంస్థలు తమ ఫీజులను తగ్గించుకుంటాయో చూడాలి.