మ‌హేష్ బాబు స‌ర్కార్‌వారి పాట సినిమాలో భారీ మార్పులు..?

ప్రిన్స్ మ‌హేష్ బాబు ఈ ఏడాదిలో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మంచి బోణీ కొట్టారు. అయితే ఆ త‌ర్వాత లాక్‌డౌన్ రావ‌డంతో ఆయ‌న ప్రాజెక్టుల‌కు బ్రేక్ ప‌డింది. అయినప్ప‌టికీ ఇప్పుడు మ‌హేష్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా త‌ర్వాత మ‌రొక‌టి ఇప్ప‌టికే ప్లాన్ చేసుకుంటున్నారు.

మ‌హేష్ బాబు, ప‌ర‌శురామ్ కాంబోలో వ‌స్తున్న సినిమా స‌ర్కారువారి పాట‌. ఈ సినిమా గురించి ముందు అనుకున్న స్క్రిప్ట్ కాకుండా ఇప్పుడు భారీ మార్పులు వ‌చ్చాయ‌ని అంటున్నారు. లాక్‌డౌన్‌లో డైరెక్ట‌ర్ క‌థ‌లో పూర్తిగా చేంజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌ట్లో ఇదో రివేంజ్ స్టోరీ అట. త‌న త‌ల్లిని మోసం చేసిన ఓ వైట్ కాల‌ర్ నేర‌స్థుడ్ని ప‌ట్టుకోవ‌డానికి హీరో చేసే ప్ర‌య‌త్నం అని కామెంట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు యాక్షన్ కమ్ మాఫియా రూట్ లోకి మార్చినట్లు తెలుస్తోంది. హీరో ప్ర‌యాణం.. ఓచోట‌ సీరియ‌స్ మ‌లుపు తీసుకోవ‌డం, అక్క‌డి నుంచి వైట్ కాల‌ర్ నేర‌స్థుల్నిప‌ట్టుకోవాల‌న్న ల‌క్ష్యంతో మాఫియా డాన్‌గా మారతాడనే పాయింట్‌తో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్ న‌డుస్తోంది. దీనిపై మహేష్ కూడా పాజిటివ్‌గానే ఉన్నట్లు స‌మాచారం. హైద‌రాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకొని ఆ త‌ర్వాత అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంటార‌ని తెలుస్తోంది. మ‌రి మార్పులు ఉన్నాయో లేదో సినిమా గురించి చెబితే కానీ తెలియ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here