సోషల్‌ మీడియాలో నేత‌ల‌ కామెంట్స్‌పై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

రాజ‌కీయ నాయ‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా చేస్తున్న వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఏపీ హైకోర్టులో నేడు ప్ర‌జాప్ర‌తినిధులు, వైసీపీ సోషల్‌ మీడియా విభాగం వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది. ఈ సంద‌ర్బంగా ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

స్పీకర్‌ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్‌, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌‌లు మీడియా, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టులో ప్రస్తుతం విచారణ జ‌రిగింది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని, జడ్జిలు, కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని న్యాయస్థానం ప్రశ్నించింది. వాళ్ల‌ని ర‌క్షించ‌డానికి కేసులు న‌మోదు చేయ‌లేద‌ని భావించాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. జడ్జిలు, కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని న్యాయస్థానం ప్రశ్నించింది. రిజిస్ట్రార్‌ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్నవాళ్లపై కేసులు ఎందుకు పెట్టలేదంది. సీఐడి విఫల‌మైతే సీఐడి విచార‌ణ‌కు బ‌దిలీ చేయాల్సి ఉంటుంద‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. కాగా సీబీఐ విచార‌ణ‌కు ప్ర‌భుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌న అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ పేర్కొన్నారు. న్యాయ‌స్థానం తీర్పును రిజ‌ర్వులో ఉంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here