కొద్ది రోజుల క్రితం విజయవాడ లో స్వర్ణ పాలస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సామాన్యులతో పాటు కోవిడ్ రోగులు సైతం మరణించారు. తాజాగా ఈ ఘటన పై హీరో రామ్ పోతీనేని స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించిన పలు పోస్ట్ లను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
సీఎం జగన్ గారూ, మీ కింద పని చేసే కొంతమంది, మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వలన మీ రిప్యుటేషన్ కి, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది అని అన్నారు. వాళ్ళమీద ఓ లుక్కేస్తారనీ ఆశిస్తున్నాం అని అన్నారు. రామ్ పోతీనెని మొదటి సారిగా పొలిటికల్ మేటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం🙏#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020