భారత్ లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు..ఇక క్షణ క్షణం భయం భయమే..

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఒక రోజుకి 60 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం తో దేశంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 65,002 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలిపి మొత్తం భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,192 కి చేరింది.

అయితే గడిచిన 24 గంటల్లో 996 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు భారత్ లో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 49,036 కి చేరింది. అయితే ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.

అలాగే గడిచిన 24 గంటల్లో 57,381 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,08,936 కి చేరింది. అయితే ప్రస్తుతం దేశం లో 6,68,220 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here