జగన్ కి భయపడి రాజకీయాలలోకి వస్తున్న జేడి లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ గతంలో జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేశాడు. అయితే లక్ష్మీనారాయణ జగన్ అవినీతి కేసుల్లో జగన్ పట్ల పక్షపాతం గా వ్యవహరించి రాజ్యాంగం ప్రకారం జగన్ కి రావాల్సిన బెయిలును రాకుండా చాలా దారుణంగా వ్యవహరించారు అప్పట్లో….జగన్ పై అక్రమ కేసులను బనయించగానే ఇతర రాష్ట్రాల నుండి సిబ్బందిను తీసుకొచ్చి మరి విచారణ చేయించారు. అయితే తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల జేడీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర కి బదిలీ అయ్యారు.
అయితే ఈ క్రమంలో ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ కోసం మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలలోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన లోకి రావాలని ఉత్సాహ పడుతున్నారట. రాబోయే ఎన్నికలలో ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే గతంలో జగన్ పట్ల వ్యవహరించిన తీరుకు జగన్ కౌంటర్ ఇస్తాడేమో అని ఇప్పటికే భయపడుతున్నాడట జె.డి. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్ తన మీద ఎటువంటి దాడిచేసినా రాజకీయంగా ఎదుర్కోవచ్చు అని ఆలోచనలో ఉన్నాడు లక్ష్మీనారాయణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here