అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చడంతో సినిమా చేద్దామని మాట ఇచ్చాడు. అయితే తరువాత అజ్ఞాతవాసి సినిమా విడుదల అయి దారుణంగా పరాజయం పాలవడంతో పవన్ కళ్యాణ్ ని ప్రణాళికలు మొత్తం తారుమారు అయ్యాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి సినిమాలకు దూరం అవడం జరిగింది.
దీంతో సంతోష్ శ్రీనివాస్ డైలమాలో పడిపోయాడు. అయితే పవన్ కళ్యాణ్ ఇటీవలే సంతోష్ శ్రీనివాస్ ని పిలిపించి .. తాను ఈ సినిమా చేయలేకపోతున్నానని సున్నితంగా చెప్పాడట, దాంతో సంతోష్ నిరాశతో వెనుతిరిగారు .. ఆ తరువాత అదే కథతో హీరో గోపీచంద్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే కథ చెప్పి అటు గోపీచంద్ తో కూడా ఓకే చేయించుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.