ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం లోక్సభలో మొదటినుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకే సభ్యులు సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ రాకముందే ఆందోళనలు నిరసనలతో హోరెత్తించారు.
ఈ క్రమంలో వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు అంటూ పెద్దేత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళారు.ఈ క్రమంలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు సీఎం రమేష్. గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి విదితమే .ఇటివల జరిగిన ఏపీలో మూడు స్థానాలకు టీడీపీ తరపున సీఎం రమేష్ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందారు.అయితే వచ్చే నెల ఏప్రిల్ రెండో తారీఖుతో తెలంగాణ తరపున ఎంపీ పదవీ కాలం ముగియనుండటంతో ఈ రోజు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.