ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం సహాయం చేయక పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కాస్త నెమ్మదిగా జరుగుతుంది అని చెప్పిరు చంద్రబాబు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏదైనా లోటు కనపడితే వెంటనే తెలుగుదేశం పార్టీ & కో మరియు చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ బీజేపీని రాష్ట్రంలో దోషిగా చిత్రీకరిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలు పరిశీలిస్తే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.3,300 కోట్ల లెక్కలపై సమాధానమివ్వటం లేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయరు.ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన బిజెపి నేతలు చంద్రబాబు చేసిన మోసాలను కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిన విషయాలను మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలతో పాలుపంచుకొన్నారు…ఈ క్రమంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరులోనే మరుగుదొడ్లు నిర్మిస్తామంటూ టీడీపీ నేతలు రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అలాగే, నీరు చెట్టు నిధులు రూ.500 కోట్లను స్వాహా చేశారన్నారు.
ఇందులో నెల్లూరు టీడీపీ నేతలది, ముఖ్యమంత్రి చంద్రబాబుల వాటా ఎంతో తేలాల్సి ఉందన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డ విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎలా సద్వినియోగపరిచారో తెలపాలన్న రాష్ట్ర బిజెపి నేతలు.