అతిలోక సుందరి శ్రీదేవి మరణం తన కుటుంబంతో పాటు తన అభిమానులను ఎంతగానో బాధించింది. శ్రీదేవి బయోపిక్ సినిమా వస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను గతంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి అయితే ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు.శ్రీదేవి లాంటి ఇంకో నటి పుట్టలేదు.. నేను తీయను! అనేశారు. అయితే ఈ క్రమంలో భర్త బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అన్నుకుంటున్నాడు.
ఈ విషయాన్ని శ్రీ దేవి భర్త బోనీకపూర్ తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మరణానంతరం తనని మీడియా వాళ్లు ప్రొజెక్ట్ చేసిన తీరుపైనా కన్నీటిపర్యంతం అయ్యారట. అందుకే అసలేం జరిగింది? అన్నదానిపైనా ఓ వివరణ ఇస్తూ బయోపిక్ని తీయాలని భావిస్తున్నాడుట. తన భార్య శ్రీదేవి లైఫ్ లో ఎవరికీ తెలియని విషయాల్ని, భార్యతో అనుబంధాన్ని రేర్ ఫుటేజీ, వాయిస్లతో వన్స్టాప్ ఫిలిం వండర్గా తీయాలని బోనీ సీరియస్గా ఆలోచిస్తున్నాడట. ఈ సినిమాకి డైరెక్టర్ గా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరెక్ న్ లో తీయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బోనీకపూర్ శ్రీదేవి మరణం షాకింగ్ లోనే ఉన్నారు…ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి అలవాటుపడుతున్నారు.