చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక దేశంలో ఇప్పటీకి ఏ ముఖ్యమంత్రిపై రానన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికల్లో అనుభవం ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రజలను నమ్మించి అనేక మోసపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…విభజనకు గురై నష్టపోయిన రాష్ట్రాన్ని మరింత దోచుకొని మరింత నష్టపరిచారు. విజయ పద్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యం వహించి రాష్ట్రానికి రాకుండా చేసారు. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టు అయిన పాలవరం ప్రాజెక్టు విషయంలో తన కేబినెట్ మంత్రులతో కలిసి అవినీతికి తెగబడ్డారు.
ఈ ఉదంతంపై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయపార్టీలు ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆరోపణలు చేసరు. అంతేకాకుండా పట్టిసీమ ప్రాజెక్టు అంటూ అవసరమైన ప్రాజెక్టు నిర్మించి ప్రజలను వంచించారు. పోలవరం పట్టిసీమ ప్రాజెక్టు అంటూ కొన్ని కోట్లు సీఎం చంద్రబాబు కాజేశారని చెప్పిన కాగ్ నివేదికను ఆధారంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో త్వరలో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.ఏపీ రాజధాని అమరావతి, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు తన మంత్రివర్గంతో కలిసి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయి.
పక్కా ఆధారాలు లభించడంతో చంద్రబాబుపై సీబీఐ ఎన్క్వైరీ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐ ఎంత త్వరగా విచారణ ప్రారంభిస్తే అంతే త్వరగా దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టు అవుతారని, అంతేకాకుండా, ఈ కేసుకు మరో నలుగురు ఐఏఎస్ స్థాయి అధికారులతోపాటు, మరో ఇద్దరు టీడీపీ నేతలు అరెస్టు కావడం కన్ఫాం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఇదే విషయం పై అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.