ఆ ఆదాయం ఉన్న వారికి ఒక తులం బంగారం ఫ్రీ..

ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వాలు కొత్త స్కీంలు తీసుకొస్తుంటాయి. అందులో వివాహానికి సంబంధించిన ఎన్నో కార్య‌క్ర‌మాలు కూడా ఉంటాయి. తాజాగా ఓ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌కం అంద‌రి నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

నూతన వధువులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. తక్కువ ఆదాయమున్న వధువులకు అరుంధతి గోల్డ్ స్కీం కింద అసోం ప్రభుత్వం ఒక తులం బంగారాన్ని బహుమతిగా అందించాలని నిర్ణయించింది. దీనికోసం 2019-20 సంవత్సరం బడ్జెట్ లో రూ.300కోట్లను కేటాయించింది. 5 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల్లోని వధువులకు ఈ బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ పథకం మొదటి ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే లభిస్తోంది.

పెళ్లి సమయంలో ప్రభుత్వం వధువులకు బంగారం బహుమతిగా అందించనుంది. దరఖాస్తుదారులు వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న రోజే అరుంధతి బంగారు పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. మొదటి వివాహానికే ఈ బంగారం బహుమతిగా ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కాగా దేశంలోని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌ధువు పెళ్లి కోసం ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్నాయి. కాగా ఇత‌ర దేశాల‌లో వివాహం చేసుకుంటే భారీగా న‌గ‌దుతో పాటు ఇత‌ర ల‌బ్దిపొందే కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here