సెలబ్రెటీలు ఏం చేసినా అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అయితే అదే సెలబ్రెటీలు చేస్తున్న పనులు ఇప్పుడు అందరూ ఆందోళనపడేలా చేస్తున్నాయి. తాజాగా నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశం అవుతోంది.
చెన్నై తమిళ టీవీ రంగంలో ఎంతో పాపులారిటీ ఉన్న నటి వీజే చిత్రం బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె వయసు 28 సంవత్సరాలు. పాండియన్ స్టోర్స్ అనే షోలో ఈమె పోషించిన ముల్లై పాత్ర ద్వారా చాలా క్రేజ్ను దక్కించుకున్నారు. దీంతో పాటు చాలా సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించిన చిత్ర.. చెన్నై నజరత్ పేట్టైలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమెకు రీసెంట్గా బిజినెస్మేన్ హేమంత్తో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు చిత్ర ఆతహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తమ అభిమాన నటులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనలు ఇక ముందు జరగకుండా ఉంటాయని ఆశిద్దాం.