కరోనా నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ముందు వరుసలో ఉందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇండియాలో ప్రతి రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్కు ఈ వైరస్ అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. తీవ్ర స్థాయిలో వైరస్ విరుచుకుపడుతుందన్నారు. చైనాలో తాజాగా 36 కేసులు, అంతకుముందు 43 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అమెరికా కరోనా వైరస్పై బాగా పోరాడుతుందని ట్రంప్ అన్నారు. వైరస్ను కట్టడి చేశామని చెప్పుకున్న దేశాల్లో మళ్లీ ఇప్పుడు కొత్తగా కేసులు నమోదవుతున్నాయన్నారు. అమెరికాలో ఇప్పటివరకు 6 కోట్ల కరోనా పరీక్షలు చేశామన్నారు.