మోదీ ఇచ్చిన టీ తాగిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎంత ఫేమ‌సో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌పంచంలోనే ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. అతి చిన్న స్థాయి నుంచి దేశ ప్ర‌ధానిగా ఎదిగిన వ్యక్తి మోడీ అంటారు. అలాంటిది ఇప్పుడు ఆయ‌న గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు.

న‌రేంద్ర మోదీ చాయ్ అమ్మిన‌ట్లు చెబుతారు. మోడీ టీలు అందించే స్థాయి నుంచి క‌ష్ట‌ప‌డి దేశ ప్ర‌ధాని అయ్యార‌ని బీజేపీ నేత‌లు, మోడీ అభిమానులు గ‌ర్వంగా చెబుతారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శతృఘ్నసిన్హా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రెండు క్లిప్పింగ్‌లను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానిలో… ఈ ప్రపంచంలో ఆ ఇద్దరి కోసం ఎంత వెదికినా దొరకడం కష్టమన్నారు. వారిలో ఒకరు మోదీ క్లాస్‌మేట్ అని, మరొకరు మోదీ చేతితో టీ అందుకుని తాగిన కస్టమర్ అని పేర్కొన్నారు.

మరొక క్లిప్‌లో… తప్పు అనేది వెనుకనున్న వీపు లాంటిదని, అది ఎవరికివారికి కనిపించదని, ఎదుటివారికి మాత్రమే కనిపిస్తుందని అన్నారు. ఈ క్లిప్పింగ్స్‌తో రిలాక్స్ అవ్వండి… ఆనందించండి… నవ్వడం అనేది ఆరోగ్యానికి ఎందో మంచింది అని పేర్కొన్నారు. కాగా శతృఘ్నసిన్హా అటల్ బిహారీ వాజపాయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1990 నుంచి 2015 వరకూ బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. 2019లో బీజేపీని విడిచిపెట్టి, అదే ఏడాది కాంగ్రెస్ టిక్కెట్‌పై పట్నా నుంచి పోటీచేసి, ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్న ఎన్నికలలో శతృఘ్నసిన్హా కుమారుడు లవ్‌సిన్హా కాంగ్రెస్ తరపున బంకీపూర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీ హోరాహోరీగా పాల్గొంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఆయ‌న త‌న స్టైల్లో విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో పాటు తేజ‌స్వీల‌ను ఆయ‌న ప‌రోక్షంగా కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here