భార‌త్‌ను దెబ్బ‌కొట్టేందుకు పాక్ ఏం చేస్తోందో తెలుసా..

అవ‌కాశం దొరికితే చాలు పాకిస్తాన్ భార‌త్‌ను దెబ్బకొట్టేందుకు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పాక్‌కి తోడుగా చైనా కూడా ఇదే ప‌నే పెట్టుకుంది. గ‌త కొన్ని నెల‌లుగా చైనా చేస్తున్న దురాక్ర‌మ‌ణ‌లు అన్నీ ఇన్నీ కావు. స‌రిహ‌ద్దులో ఆక్ర‌మ‌ణ‌లు చేస్తూ వివాదాన్ని పెద్ద‌ది చేస్తోంది.

చైనా, భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న వివాదం యుద్ధం వ‌ర‌కు వెళ్తోంద‌న్న భ‌యం నెల‌కొంది. అయితే దీన్ని సైనికాధికారులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఆందోళ‌న‌లు మాత్రం ఉదృత‌మ‌వుతూనే ఉన్నాయి. చ‌ర్చ‌లు జ‌రుపుతున్నా చైనా మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాల చ‌ర్చ‌లు కొనసాగినా చైనా అవ‌కాశం దొరికితే ఆక్ర‌మ‌ణ‌లు చేయ‌డానికి దూకుడుగా ముందుకు వెళుతోంది. ఈ ప‌రిస్థితుల్లో చైనాకు తోడుగా పాకిస్తాన్ వెళుతోంది.

ఇటీవ‌ల చైనాకు చెందిన న్యూస్ ప్రొడ్యూసర్ ఒక వీడియోను ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేశాడు. ఇందులో సైనికులు చాలా మంది ఉన్నా.. ఒక్క‌రు మాత్రం అనుమానాస్ప‌దంగా ఉన్నాడు. ఇత‌డు చైనాకు చెందిన వ్య‌క్తి కాద‌ని భార‌త సైనికాధికారులు గుర్తించారు. ఇత‌ను పాకిస్తాన్‌కు చెందిన ఆర్మీ క‌మాండో అని చెబుతున్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే చైనాకు స‌హాయం చేసేందుకు పాక్ సైనికుల‌ను కూడా పంపిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పాక్ సైనికుల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం చైనాకు ఏముంద‌ని అనుమానాలు రావొచ్చు. కానీ అత్యంత క్లిష్ట‌మైన ప‌ర్వ‌తాల్లో పోరాడేందుకు భార‌త్‌తో స‌రితూగే సైనికులు ఏ దేశంలోనూ లేరు. ఆ లెవ‌ల్‌లో డ్యూటీ చేయ‌గ‌ల అనుభ‌వం పాకిస్తాన్ సైనికుల‌కు ఉంది. దీంతో ఇరు దేశాలు సైనికుల‌ను కూడా స‌హాయం చేసుకుంటున్నాయ‌ని క్లారిటీ వ‌చ్చింది. పాక్ ద‌ళాల‌కు భార‌త్‌ను సియాచిన్ వ‌ద్ద ఎదుర్కొన్న అనుభ‌వం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here