‘దిశా’ ట్రైలర్ వచ్చేస్తోంది…

నిత్యం కాంట్రవర్సీలతో సావాసం చేస్తుంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. సమాజంలో జరిగే అంశాల చుట్టూ సినిమాలు తీయడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు కాంట్రవర్సీ సబ్జెక్టులతో సినిమాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ తాజాగా దిశ హత్య నేపథ్యంలో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.

గతేడాది నవంబర్ లో  హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొంతమంది యువకులు ఓ అమ్మాయి పై అత్యాచారం చేసి, కాల్చి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక అనంతరం పోలీసులు ఆ యువకులను ఎన్ కౌంటర్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ కథాంశాన్ని ఆధారం చేసుకొని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశా ఎన్‌కౌంటర్‌’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రేపు ( శనివారం) ఉదయం 9గంటల 08 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్‌ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిశా ఘటన జరిగిన రోజు నవంబర్‌ 26నే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here