” గడిచిన రెండు రోజుల్లో నేను మన పార్టీ కార్యకర్తలతో పాటు ఓటర్ లతో కూడా మాట్లాడాను. ఇది నిజం ఒప్పుకునే సమయం తప్ప క్షమాపణలు చెప్పే సమయం కాదు. తిరిగ పూర్వ వైభవం సాధించడం కోసం తప్పులని పరిశీలించుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం.. ఓటర్లకు, కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం. మాకు మేమే ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. మాటలు కాకుండా చేతల్లో చెప్పినది చేసి చూపించాల్సిన టైం ఇది.
మేము ప్రమాణం చేసిన మార్పుని తీసుకొచ్చే వైపుగా అడుగులు వేస్తున్నాం .. జైహింది ” అంటూ డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా లో వెల్లడించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఈవీఎంలపై తమకు అనుమానాలున్నాయని చెప్పిన కేజ్రీవాల్, రెండు రోజుల తరువాత ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ పెట్టడం గమనార్హం.