లాక్డౌన్ కారణంగా అన్ని రంగాల్లోనే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ప్రాజెక్టులు లేక చాలామంది ఉద్యోగులకును తొలగించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ కోవలోనే ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.83,500 కోల్పోయాడు. డబ్బున్న ఆంటీలను సుఖపెట్టాలని, అందుకు గాను రోజూ రూ.వేలల్లో సంపాదించుకోవచ్చని మాయగాళ్లు చెప్పిన మాటలు విని అడ్డంగా బుక్కయ్యాడు.
వారు చెప్పినట్లుగా రూ.1009 చెల్లించి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. మెంబర్షిప్ ఫీజు కింద మరో రూ.12,500 చెల్లించాడు. సరసాల ఉద్యోగంలో ప్రవేశించే ముందు సెక్యూరిటీ, ఇతర ఫీజులంటూ సైబర్ కేటుగాళ్లు మరో రూ.70 వేలు గుంజుకున్నారు. వారు మళ్లీ ఫోన్ చేసి ఇతరత్రా ఫీజుల కింద మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో తన దగ్గర ఇంక డబ్బుల్లేవని, ఉద్యోగంలో చేరాక మిగిలిన సొమ్ము ఇస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తూనే ఉంది.దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.