దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో 62,000 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు మొత్తం 22,15,074 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,34,945 కేసులు యాక్టివ్ ఉంన్నాయి. సుమారు 15,35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 44,386 చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 4,77,023 కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 2,45,83,558 కి చేరింది. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 69.3గా ఉండగా, మరణాల రేటు 2 శాతంగా ఉంది.