తెలంగాణలో పరిస్థితి కాస్త మెరుగవుతుందన్న తరుణంలో నేడు అమాంతంగా పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,384 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనాతో మరో 11 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకుని నేడు 1,851 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ రోజు వచ్చిన తాజా కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,249 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 80,586 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 22,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 755 కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 26,767 మంది శాంపిల్స్ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,48,078 టెస్ట్లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.43 శాతం ఉండగా, మరణాల రేటు 0.74% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.