పార్ల‌మెంటు జ‌రుగుతున్న వేళ మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా..

ఓవైపు పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతుంటే క‌రోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి క‌రోనా సోకింది.

నితిన్ గ‌డ్క‌రీకి నీర‌సంగా అనిపించ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకున్నారు. దీనిలో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సూచ‌న మేర‌కు తాను హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతానికి త‌న ఆరోగ్యం బాగున్న‌ట్లు గ‌డ్క‌రీ చెప్పారు. ఇటీవ‌లె త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

కాగా తాజాగా 30 మంది ఎంపీల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. క‌రోనా బారిన ప‌డిన కేంద్ర‌మంత్రుల్లో అమిత్‌షా, అర్జున్ మేఘ్వాల్‌, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, శ్రీ‌పాద్ నాయ‌క్‌, స‌తీష్ మ‌హానా, సిద్ధార్ నాథ్ సింగ్ త‌దిత‌రులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here