మనుషుల నుంచి పిల్లులకు వ్యాపిస్తున్న కరోనా..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా…  కేవలం మనుషుల నుంచి  మనుషులకు వ్యాపిస్తుందని మనకిప్పటివరకు తెలుసు. కానీ మానవుల నుంచి జంతువులకు కోవిడ్ సోకుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. కరోనా పుట్టినిల్లయిన వూహాన్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

102 పిల్లుల నుంచి రక్త నమూనాలను సేకరించి చూడగా.. వాటికి కోవిడ్ సంక్రమించిందనే విషయం వెల్లడైందని వూహాన్ లోని హువా జాంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.

కరోనా బారిన పడిన వారు తమ పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. దీంతో ఇన్ని రోజులుగా మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకదనుకున్నది అంతా మన భ్రమేనని తేలిపోయింది… కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంతగానో ఇష్టపడే మీ పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here