ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కి కరోనా పాజిటివ్

ఇప్పుడు మన దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్న వారే ఊహించని విధంగా దీని భారిన పడుతుండటంతో అన్ని రంగాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

ఇవే అనుకుంటే కరోనా మన రాజకీయ నాయకులను కూడా కరోనా వదల్లేదు.గత కొన్ని రోజుల కితం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులకు షాకిచ్చిన కరోనా ఇప్పుడు ఏపీ రాజకీయ నాయకులకు అంటుకుంది. ఏపీ డిప్యూటీ సిఎం అంజద్ భాషా కు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ కావడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.

కేవలం అతనికి మాత్రమే కాకుండా అతని భార్య మరియు కుమార్తె కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యిందట. అయితే వారిని వెంటనే తిరుపతి స్విమ్స్ కు తరలించి వైద్యం అందించినప్పటికీ మళ్లీ హైదరాబాద్ ఆసుపత్రి చికిత్స ను తీసుకోడానికి వెళ్లిపోవడం ఆశ్చర్యకరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here