భారత్లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొన్ని రోజులు కేసులు తక్కువగా నమోదవుతున్నాయని సంతోషపడే లోపే మళ్లీ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో కొత్తగా 86వేల432 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 40 లక్షల 23వేల 179కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 69వేల 561కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1089 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
ఇక ఏపీలో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో 10,776 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,76,506కి చేరుకుంది. తాజాగా 76 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,276కి చేరుకుంది.
ఇక తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. 24 గంటల్లో 2,511 పాజిటివ్ కేసులు తెలంగాణాలో నమోదయ్యా్యి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.24 శాతంగా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో 75.5 శాతంగా ఉంది.