గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా పేరు చెప్పగానే అందరికీ .. సమయం లేదు మిత్రమా శరణమా రణమా అనే డైలాగ్ మాత్రమే వినిపిస్తుంది. బాలయ్య నోట్లోంచి పలికిన ఈ డైలాగ్ సాయి మాధవ్ బుర్రా రాసాడు , క్రిష్ అద్భుతమైన సన్నివేసం లో ఈ డైలాగు ని బాలయ్య తో చెప్పిస్తాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ అసంబ్లీ లో చంద్రబాబు ఈ డైలాగు మాట్లాడడం విశేషం.
పదవ తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ మీద చర్చ జరుగుతూ ఉన్న టైం లో వైసీపీలో ఉండే ప్రతి ఒక్క సభ్యుడిని అడుగుతున్నా.. రెండే ఆప్షన్స్… సమయం లేదు మిత్రమా… ఇటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయడం ఆపేస్తారా.. అంటూ సీరియస్ గానే ఆ సినిమా డైలాగ్ ని ఉచ్చరించారు. తప్పు చేసింది ఎవరు అనేది తను చూడను అని ప్రతిపక్షం అయినా తన పక్షం అయినా టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే తాను సైలెంట్ గా ఉండబోను అన్నారు చంద్రబాబు . బాబు డైలాగ్ తో టీడీపీ క్యాడర్ ఫుల్ జోష్ తో చప్పట్లు కొట్టారు .