An 8-month pregnant woman at the Covid Isolation Centre in Vijayawada Govt Hospital shot this shocking video of a patient lying dead on the floor for 3 hrs. She claims the patient vomited & died yet no staff had come about to help her. Scary & pathetic.
From: @sidforbhaarat pic.twitter.com/R1tMBeukWK— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 22, 2020
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కరోనా పేషెంట్ల పరిస్థితి ఆసుపత్రిలో ఈ విధంగా ఉందా అన్నట్లు ఆయన వీడియో ట్విట్టర్లో ఉంచారు.
విజయవాడలోని స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఈ వీడియోలో ఐసోలేషన్ వార్డులో ఉన్న ఓ మహిళ ఆనారోగ్య కారణాల వల్ల వాంతులు చేసుకుంది. వెంటనే ఆమె మంచంపై నుంచి కింద పడి పోయింది. ఆ తర్వాత ఆమె మృతిచెందారు.
అయితే ఒక పేషెంట్ కింద పడినా అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. మూడు గంటల పాటు సిబ్బంది ఎవ్వరూ రాలేదని బాబు పోస్టు చేసిన వీడియో ద్వారా తెలియజేశారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. హాస్పిటల్లో మహిళ చనిపోవడం వాస్తవమే అయినప్పటికీ సిబ్బంది ఎవ్వరూ లేరనడం సరైంది కాదన్నారు. ప్రతి వార్డులో సిబ్బంది ఉంటారన్నారు. ఆమె చనిపోయిన విషయం తెలిసిన వెంటనే సిబ్బంది వెళ్లిపోయారని.. అంతకుముందే వీడియో తీసి ఉంటారన్నారు.