ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై మంత్రి కురసాల కన్నబాబు వ్యంగాస్త్రాలు సంధించారు. జమిలి ఎన్నికలు వస్తాయని చంద్రబాబు లోకేష్లు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల పేరు చెప్పి నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
విద్యుత్పై చంద్రబాబు పోరాటం చేశానని చెప్పిన విషయంపై మంత్రి స్పందించారు. చంద్రబాబు ఎప్పుడు పోరాటం చేశారని ప్రశ్నించారు. దేశంలో తొలిసారి ఉచిత విద్యుత్ ఇచ్చింది వైఎస్సారే అన్నారు. కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులను చంద్రబాబు జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. ఇక ఉచిత విద్యుత్ వలన రైతులపై భారం పడదని, నగదు బదిలీ వలన రైతులకు మేలు జరుగుతుందన్నారు.
జగన్ ఎప్పటికీ రైతులకు అండగానే ఉంటారన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీకే రుణాలు, ధరల స్థిరీకరణ కోసం రూ. 3వేల కోట్లు కేటాయించడం జగన్కే సొంతమైందని గుర్తు చేశారు. చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలు రూ.910 కోట్లను సీఎం జగన్ చెల్లించారన్నారు. రైతులు బలవర్మణం పొందితే 7 లక్షలు ఇవ్వాలని ఆయన ఆదేశించారని తెలిపారు.