టాలీవుడ్ సంక్రాంతి హీరో నందమూరి బాలకృష్ణ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహా’ సినిమాను నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు..ఈ క్రమంలో నిర్మాత సి.కల్యాణ్ జై సింహా’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు..ముఖ్యంగా ఈ చిత్రాన్నిఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ పెద్దదిక్కు దివంగత దాసరి నారాయణరావుగారికి అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన గురించి నిర్మాత సి.కళ్యాణ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు….తరవాత బాలయ్య – దాసరిలతో ఓ సినిమా చేయాలని కల్యాణ్ భావించేవార్ట. దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ”గురువు గారూ.. మీరు త్వరగా కోలుకుని రండి.. మీతో బాలయ్యతో ఓ సినిమా చేస్తా” అని కల్యాణ్ చెప్పేవార్ట. ఆ కోరిక తీరలేదు. అందుకే… సి.కల్యాణ్ బాలయ్యతో తీసిన ఈ సినిమాని దాసరికి అంకితం ఇచ్చారు…మరియు “జై సింహా” తెలుగు ఇండస్ట్రీలో అనేక రికార్డులు సృష్టిస్తుందని నమ్మకం నాకుంది అని సి.కళ్యాణ్ అన్నారు.ఆ నమ్మకంతోనేసినిమాను నేనే విడుదల చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.