ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 48 గంటల సవాల్ విసిరి చంద్రబాబు ఏం చేశారన్నారు.
విశాఖపట్నంలో త్వరలోనే సీఎం జగన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటే.. తాము చట్టాలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. వెనుక, ముందు కట్ చేసి ఉన్న వీడియోలు చంద్రబాబు ప్రజల్లోకి వదులుతున్నారు.
అమరావతి రాజధాని కాదని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో కూడా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తామని బొత్స అన్నారు.