ఆంధ్రప్రదేశ్లో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ ఆలయాలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న బీజేపీ నేతలపై ఆయన తిరిగి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు రోడ్లపై కొచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. విజయవాడ, తిరుపతి, కడపతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట, ఆర్డీవో కార్యాలయాల ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. పలు చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, విష్ణు వర్దన్ రెడ్డి, భానుప్రకాష్రెడ్డి, తదితరులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మంత్రి వ్యాఖ్యలను సరైనవి కావన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పరిచారన్నారు. మంత్రి వర్గం నుంచి ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా జగన్ తిరుమలకు వెళ్లేటపుడు కుటుంబ సమేతంగా రావాల్సింది పోయి సింగిల్ గా వస్తున్నారని ప్రతిపక్షాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాయి. దీంతో మోదీ, యోగి ఆదిత్యానాథ్లు కుటుంబంతోనే ఆలయాలకు వెళ్తున్నారా అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. దీంతో దుమారం రేగింది. ప్రతిపక్షాలు ఆందోళలు చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.