బ్యాంక్ ఆఫ్ అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున సంజీవ్ శర్మ కుటుంబానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బతో అతిపెద్ద కుదుపు ఎదురు అయ్యింది. ట్రంప్ వీసాల విషయం లో తీసుకున్న షాకింగ్ నిర్ణయం కారణంగా అతనికి వీసా రెన్యువల్ అవ్వడం లేదు. భారత్ కి వచ్చిన సంజీవ్ శర్మ తన దగ్గర ఉన్న షేర్ లూ ఇల్లూ అన్నీ అమ్మేసుకుని బతకాల్సి వచ్చింది.
వీసా డిలే కారణంగానే ఇదంతా జరిగింది. ఈ నేపధ్యంలో అతని భార్య కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. డిల్లీ కి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అంటూ ఆమె అతన్ని ప్రెజర్ పెట్టింది. ఆమె ఆరోగ్యం తో పాటు పిల్లల భవిష్యత్తు గురించి కూడా భయపడిన శర్మ భార్య ఆత్మహత్య కి పాల్పడింది.ఇద్దరు కుమారులతో కలిసి రాత్రి తిరిగి వచ్చిన సంజీవ్ శర్మకు రష్మీ శర్మ విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.