జ్యోతిక ప్రధాన పాత్రలో ‘బంగారు తల్లి’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగేలా కనిపిస్తోంది. 2004వ సంవత్సరం ఊటీలో ఐదుగురు పిల్లలను కిడ్నాప్ చేసిన ఉదంతంలో.. కిడ్నాప్ చేసి హత్యకు గురైన జ్యోతి అనే చిన్నారి కేసు దర్యాప్తు నేపథ్యంలో సినిమా కొనసాగనుంది. ఇందులో జ్యోతిక లాయర్ గా కనిపించనుంది. ట్రైలర్లో వచ్చే.. ‘ పోరాడి ఓడిపోయాను అనడానికి.. ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా హింసించబడిన ఎందరో ఆడ పిల్లల దగ్గర నిజం తప్ప ఇంకేం సాక్ష్యం ఉండదు యువరానర్. ఇది గేమ్ కాదు జస్టిస్’ డైలాగ్ ఆకట్టుకుంటోంది. మరి ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.