హైదరాబాద్ అంటేనే కబ్జాలకు అక్రమాలకు నిలయంగా ఉంటుంది ఆ ప్రదేశంలో భూములకు సంబంధించి కొన్ని కుంభకోణాలు నేకమైనవి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న ఉన్నాయి. తాజాగా ఒక కుంభకోణం గురించి అధికార తెరాస అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ ప్రచురించింది.ఈ కుంభకోణానికి పాల్పడిన వారు మరెవరో కాదు టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత అయినా సి.కళ్యాణ్.ప్రస్తుతం సీ కళ్యాణ్ బాలకృష్ణ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తున్నాడు.
ఈ పత్రిక కథనం ప్రకారం చూస్తే ఈ కుంభకోణం చాలా పెద్ద స్కెచ్ తో కూడినట్లు క్లియర్ అవుతోంది. సుమారు 80ఎకరాల భూమి ప్రస్తుతానికి అయితే హక్కు పరంగా, రిజిస్ట్రేషన్ పరంగా సి కళ్యాణ్ పేరిటే వుంది.దీని వెనుక చాలా కుట్ర ఉందని దానికి సంబంధించిన వివరాలను స్పష్టంగా వివరించంది.ఇప్పటివరకుఈ కుంభకోణం మీద అధికార యంత్రాంగం దృష్టి పెట్టలేదని, అంటే ఈ వ్యవహారానికి వాళ్ల మద్దతు కూడా వున్నట్లు అనుమానాలు కలుగుతుంది అని రాసుకు వచ్చింది.
ఇటువంటి నిర్మాత సి.కల్యాణ్ కు కొత్తేమీ కాదు, అయితే ఈ క్రమంలో సి కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రస్తుతం సీ కళ్యాణ్ బాలకృష్ణ హీరోగా ఒకటి , సాయి ధరం తేజ్ హీరో మరొకటి సినిమాలు చేస్తున్నారు. వీటిలో బాలయ్య సినిమా సంక్రాంతికి, రెండో సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతాయి.