” నా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో ఎలాంటి లాబీయింగ్ లకీ వెళ్ళలేదు. ఒక్కపని కూడా అడుక్కుని , బతిమాలుకుని చేయించుకున్న రోజు లేదు. సెక్రటేరియట్ దగ్గరకి కూడా వెళ్ళింది లేదు ” అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చెప్పుకొచ్చారు. నిన్న సాయంత్రం నెల్లూరు లో జరిగిన నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రమాణ స్వీకారానికి బాలయ్య వచ్చారు.
అక్కడ మాట్లాడిన ఆయన అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాలు ఎలా ఉండేవో చెప్పుకొచ్చారు. ” ఎవ్వరూ చేయ్యనంతగా బడుగు బలహీన వర్గాల జనాలకి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కాలి. చంద్రబాబు కూడా ఆయన లాగానే రైతులకి దగ్గర బంధువు. ఇరవై నాలుగు గంటలూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఆలోచించే మనస్త్వత్వం చంద్రబాబు ది. మరొక పదేళ్ళ పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది ” అన్నారు ఆయన .