హిందూపురం లో తన అభిమానుల సాక్షిగా, హిందూ పురం ప్రజల సాక్షిగా గత నెల బాలయ్య తన తండ్రి బయో పిక్ గురించి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత దానికి సంబంధించి పెద్ద డిస్కషన్ లు సాగాయి. బాలయ్య ఆయన సినిమాని తీసే దమ్ముందా ? వక్రీకరణ చేస్తారా అంటూ అనేక ప్రశ్నలు ఉదయించాయి. కానీ ఆ విషయాలు అన్నీ బాలయ్య ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడా కనపడ్డం లేదు. ఈ విషయం మీద విజయవాడ లో ఇవాళ మీడియా తో మాట్లాడిన బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత విశేషాలు అన్నీ కన్సిడర్ చేసుకుని వచ్చే ఏడాది ఆ సినిమా ఖచ్చితంగా చేస్తా అనీ బోయపాటి శ్రీను తో కానీ వినాయక్ తో కానీ ఈ సినిమా ఉంటుంది అని ప్రకటించారు.
డైరెక్టర్ ల పేర్లు ఆయన ఓపెన్ గా చెప్పకపోయినా ఆయన మాటల్లో యాక్షన్ డైరెక్టర్ అనే పేరు వాడారు. మొత్తం మీద బాలయ్య విమర్శలు ఎదురుకుంటూ వారి నోరు మూయించే విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఏప్రిల్ 2 న తాను విజయవాడ లోనే ఉంటున్నట్టు తెలిపారు బాలయ్య.