పూరీ జగన్నాథ్ – బాలకృష్ణ ల చిత్రం పైసా వసూల్ చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మామూలుగానే ఫుల్ ఫాస్ట్ లో షూటింగ్ లు లాగించేసే డైరెక్టర్ పూరీ బాలయ్య జోష్ తో ఇంకా ఫాస్ట్ గా అంతా కంప్లీట్ చేసేసాడు. సెప్టెంబర్ 29 న విడుదల చేస్తాం అంటూ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజునే అధికారికంగా ప్రకటించేసాడు పూరీ. దసరా నాటికి చిత్రం వచ్చి తీరుతుంది అనీ అది 27 , 28 , 29 లలో ఒకరోజు అని అన్నాడు పూరీ. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది పూరీ జగన్నాథ్ – బాలయ్య లాంటి క్రేజీ కాంబినేషన్ వస్తున్నా దసరా నాటికి మహేష్ స్పైడర్ తో వచ్చేస్తున్నాడు.
మహేష్ సినిమా అంటే చిన్నదేమీ కాదు మురుగదాస్ కాంబినేషన్ కూడా అవ్వడం తో విపరీతమైన క్రేజ్ ఉండనే ఉంది. మరొక పక్క ఇప్పుడు జై లవకుశ కూడా విడుదల ప్రకటన చేసేసారు. దీంతో బాలయ్య ఈగో హర్ట్ అయిందట. తన సినిమాకి మరోసారి స్పేస్ ఇవ్వడం లేదని ఆయన ఫీలవుతున్నారట.