నిజాం లో రెండేళ్ళ క్రితం బాహుబలి మొదటి భాగం పాతిక కోట్ల షేర్ ని వసూలు చేస్తే ఓయబ్బో అన్నారు. ఆ తరవాత కాలం లో నిజాం లో పాతిక కోట్లు చేసిన సినిమా మరేదీ లేదు .. ఇరవై కోట్లు దాటినా అక్కడ గొప్పే కానీ అలాంటి చిత్రం కూడా లేదు. కానీ బాహుబలి రెండో భాగం కొత్త అధ్యయనాన్ని లిఖిస్తోంది. నైజాం ప్రాంతం లో మొట్టమొదటి యాభై కోట్ల వసూళ్లు సాధించిన చిత్రం గా ఈ సినిమా రికార్డులకి ఎక్కేసింది.
పదకొండవ రోజు నలభై కోట్లు సాధించిన ఈ సినిమా రేపు సాయంత్రం కల్లా ఈ ఫీట్ సాధిస్తుంది. మొదటి భాగం ఇరవై ఐదు కొత్లి సాదిస్తే రెండో భాగాన్ని నలభై కి అమ్మారు ప్రొడ్యూసర్ లు .. మొదటి భాగాన్ని పంపిణీ చేసిన దిల్ రాజు కూడా ఈ రేట్కి కొనడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో నిర్మాతలు అడ్వాన్స్ పద్ధతిలో సొంతంగా విడుదల చేసుకున్నారు.