ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లెతెర‌పై క‌నిపించ‌బోతున్నారా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు అభిమానుల‌కు పండ‌గే.. అలాంటిది తార‌క్ ప్ర‌తి రోజూ ఓ కొత్త గెట‌ప్‌లో క‌నిపిస్తారంటే ఇక అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. ఎన్టీఆర్ ఇప్ప‌టికే బుల్లితెర‌పై వ్యాఖ్యాత‌గా అంద‌రినీ అల‌రించారు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఎన్టీఆర్ టీవీలో క‌నిపించ‌బోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్‌ ఉన్నారు. వీరిలో తారక్‌ నేటి తరానికి చెందిన స్టార్‌ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా తారక్‌ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం.ప్రముఖ టీవీ ఛానెల్‌ జెమినీ సంస్థ మీలో ఎవరు కోటీశ్వరుడు స్టైల్లో స్పెషల్‌ ప్రోగామ్‌ను డిజైన్‌ చేసిందట. దీన్ని ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తారని టాక్‌ వినిపిస్తోంది. మరి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ వార్తలపై తారక్‌ క్యాంప్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాలో తార‌క్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది కాకుండా ఇంకా చాలా సినిమాలు ఆయ‌న చేయాల్సి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో బుల్లితెర‌పై తార‌క్ ప్రోగ్రాం చేయ‌డానికి టైం ఉటుందా అన్న‌ది ముఖ్యం. మ‌రి ఈ పుకార్ల‌కు పులిస్టాప్ ప‌డాలంటే అఫిషియ‌ల్ న్యూస్ బ‌య‌ట‌కు రావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here