బాలీవుడ్ లోకి ‘భాగమతి’..

అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో ‘ భాగమతి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 2018 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనుష్క నటన, అశోక్ దర్శకత్వ తీరు ఈ సినిమాను విజయతీరాలకు తీసుకెళ్లింది.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు అశోక్. ‘ దుర్గాదేవి’ పేరుతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో  తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క పాత్రలో బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ నటిస్తోంది. విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్ లతో కలిసిఅక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో అక్షయ్ కూడా ఓ పాత్రలో నటిస్తుండడం మరో విశేషం. తెలుగులో మంచి విజయం సొంతం చేసుకున్న భాగమతి… మరి హిందీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here