‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ తో చేతులు కలపనున్న బాలయ్య..? 

‘ఎఫ్-2’, ‘సరిలేరు నీకెవ్వరు’..  చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ సినిమాల్లో తనదైన కామెడీని జోడించి సినిమాలను తెరకెక్కించడంలో అనిల్ ది అందెవేసిన చేయి. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఎఫ్3 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్ర షూటింగ్… త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తర్వాతి చిత్రంపై ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది. అనిల్ తన తరువాత సినిమాని నటసింహం బాలకృష్ణతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అనిల్ ఇప్పటికే బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. వచ్చే ఏడాది చివర్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి కామెడీ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో బాలయ్య పాత్ర ఎలా ఉంటుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here