‘సర్కారు వారి పాట’లో బాలీవుడ్ హీరో..?

మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ‘ సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్  హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘సర్కారు వారి పాట చిత్రంలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటించనున్నాడని తెలుస్తోంది. అనిల్ ఈ సినిమాలో విలన్ పాత్రను  పోషించనున్నట్లు పలు ఇంగ్లిష్ వెబ్ సైట్ లు కథనాలు రాశాయి. అనిల్ కపూర్ ఈ విషయమై ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here