రుణ బకాయిలు చెల్లించడం లేటు అయితే మనతో విద్యుత్ బోర్డు వారు ఎలా ప్రవర్తిస్తారు? మనం వాడుకుంటున్న బకాయిలకి బదులుగా కరంట్ పీకి పడేస్తారు కదా ? అదే ఇప్పుడు జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల విషయం లో తెలంగాణా మొండి చెయ్యి చూపించడం తో ఈ రెండు రాష్ట్రాల మధ్యనా కొత్త వివాదం రాజుకుంది. ఈ వివాదం ఇప్పటిలో ముగిసేలా కనపడ్డం లేదు డబ్బు కట్టే పరిస్థితి లో తెలంగాణ ప్రభుత్వం లేకపోవడం తో విద్యుత్ సరఫరా ని ఏపీ అధికారులు ఆపేశారు.
విభజన చట్టం ప్రకారం ఏపీ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణా కి పన్నెండు వందల మెగా వాట్లు సరఫరా చెయ్యాలి. ఏపీ అదనంగా నాలుగొందల వాట్లు ఇచ్చింది దానికి నాలుగు వేల కోట్ల పైగా డబ్బు కట్టాలి కానీ ఆ డబ్బు ఇవ్వడం లేదు తెలంగాణా సర్కారు. ఈ డబ్బుతో పోలవరం ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రం నిర్మించవచ్చని అధికారులు చెబుతున్నారు.