శ్రీముఖి సరికొత్త టాక్ షో..

అనతి కాలంలోనే యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది శ్రీముఖి. ఈటీవీలో ప్రసారమైన పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ క్రేజీ యాంకర్… ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయం లో విభిన్న ప్రోగ్రామ్స్ తో యూట్యూబ్ వేదికగా ప్రేక్షకులను అలరించిందీ చిన్నది.

ఇదిలా ఉంటే శ్రీముఖి తాజాగా మరో సరికొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టింది. తన యూట్యూబ్ ఛానల్ లో ‘ఉమానియా’ పేరుతో ఒక టాక్ షోను ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఒక్కరోజులోనే మూడున్నర లక్షలకు పైగా మంది వీక్షించడం విశేషం. ఇక శ్రీముఖి యూట్యూబ్ ఛానల్ కు లక్షన్నరకు పైగా సబ్ స్కైబర్లు ఉన్నారు. మరి శ్రీముఖి టాక్ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరో చూడాలి. శ్రీముఖి ‘ఉమానియా’ ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here