వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాడు. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని ప్రత్యేక హోదా యొక్క లాభాలు ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగుతున్నారు ప్రజా సంకల్ప పాదయాత్రలో. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కు చంద్రబాబు నాయుడుకు ఏం చేయాలో అర్థం కాక తన ఎల్లో మీడియా తో జగన్ మీద ఇదివరకు చేసిన ఆరోపణలను చేయిస్తూ తన పార్టీ నాయకులతో కూడా జగన్ మీద విమర్శలు చేయి స్తున్నాడు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణరెడ్డి దిక్కుమాలిన విమర్శలు చేశారు. జగన్ రాజీనామా వ్యాఖ్యలు డ్రామాలని.. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారని.. అయితే జనం ఇలాంటి వాటికి పడిపోరని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడే స్థాయి రోజాకు లేదని కూడా ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు చేశారు.