కుక్కలు, పిల్లులు, పక్షులు పెంచుకోవడం మనకు అలవాటు. కానీ అమెరికా విచిత్రంగా దోమలను పెంచింది. అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 కోట్ల దోమలను అమెరికా పెంచింది. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. విషయమేంటో తెలుసుకోండి.
అమెరికా విషజ్వరాలను అరికట్టేందుకు ఈ దోమలు తయారు చేస్తోంది. ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ ద్వీపాల్లో ఈ దోమలను వదిలేందుకు అధికారులు ఈ ప్రయత్నం చేస్తున్నారు. చికున్గున్యా, ఎల్లో ఫీవర్ వంటి విషజ్వరాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తాయి. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మిగతా జ్వరాలు మనకు అంత కనపడటం లేదు. కరోనా లేకపోతే విషజ్వరాల గురించే మనం మాట్లాడుకునే వాళ్లం.
మొత్తానికి ఈ విషజ్వరాలను అరికట్టాలంటే ఏజిప్టి అనే ఆడ దోమలను అరికట్టాల్సి ఉంటుంది. దీంతో ఫ్లోరిడాలో బ్రిటన్కు చెందిన ఆక్సిటెక్ అనే కంపెనీలోని ల్యాబ్లో జన్యుపరంగా వృద్ది చేయబడిన 75 కోట్ల ఈ దోమలను పెంచారు. వీటికి OX5034గా పేరు కూడా పెట్టారు. ఈ దోమలన్నింటినీ తీసుకెళ్లి ఫ్లోరిడా కీస్ ద్వీపంలో వదిలేస్తారు. ఈ మగ దోమలన్నీ అక్కడి ఆడ దోమలతో సంయోగం జరిపుతాయి.. ఈ క్రమంలో కొంత సమయానికంతా ఆడ దోమలు చనిపోతాయి.
ఈ విధంగా భయంకరమైన ఆడ దోమలను అరికట్టాలని అక్కడి ప్రభుత్వం కొత్త తరహా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇది ఇప్పుడే మొదటి సారి కాదు. గతంలో బ్రెజిల్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విజయవంతం అయ్యింది.