స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో నా పేరు సూర్య సినిమా విడుదల కాకముందే తన తర్వాత సినిమా ను లైన్లో పెట్టాడు అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అని అంటున్నారు.
ఇటీవల క్రిష్ వినిపించిన ఒక కథ అల్లు అర్జున్ కి బాగా నచ్చేసిందనీ, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ కాంబినేషన్ పట్టాలెక్కే దిశగా ఉంది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న ‘నా పేరు సూర్య ‘ షూటింగు పరంగా ముగింపుదశకి చేరుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ భారతీయ సైనికుడి గా కనిపిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సినిమా యూనిట్.