టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన తర్వాత సినిమా ను లైన్లో పెట్టేశాడు అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రవికాంత్ పేరెపు ..అల్లు అర్జున్ కి ఒక కథను వినిపిస్తున్నాడని అంటున్నారు.’క్షణం’ సినిమాను రవికాంత్ తెరపై ఎలా ఆవిష్కరించాడో .. ఎంతటి సక్సెస్ ను అందుకున్నాడో అల్లు అర్జున్ కి తెలుసు.
అందువలన ఆయనతో కథా చర్చలు జరుపుతున్నాడని చెబుతున్నారు. రవికాంత్ .. అల్లు అర్జున్ ను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి మరి. అంతేకాకుండా మరోవైపు కోలీవుడ్ ఇండస్ట్రీ సంచలన దర్శకుడు అట్లీ కుమార్ కూడా బన్నీ తో సినిమా చేయాలని అనుకొంటున్నారట.